అమరావతి
రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి
పనులు శరవేగంగా సాగుతున్నాయి.
మొన్నటివరకు రాత్రిళ్లు చీకటిమయంగా ఉన్న
సీడ్ యాక్సెస్ రోడ్డు నేడు విద్యుత్తు వెలుగు
లతో కళకళలాడుతోంది. మంతెన
సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి రాయ
పూడి వరకు ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు 8
కిలోమీటర్ల మేర విద్యుత్తు స్తంభాల పునరుద్ధరణ పనులను అధికారులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. సోమవారం రాత్రి ఈరహదారిపై విద్యుత్తు దీపాల వెలుగులు
కనులవిందు చేశాయి. అమరావతికి పట్టిన
గ్రహణం వీడిందని స్థానికులు సంతోషం
వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 28