60 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ముందే కూస్తారు ?

హైదరాబాద్ : కర్ణాటక లో కాంగ్రెస్ విజయంతో పక్క రాష్ట్రమైన తెలంగాణలోనూ కొంత ఉత్సహం కనిపిస్తోంది. తెలంగాణ లో సాధారణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సందర్బంగా సుమారు యాభై నుంచి అరవై మంది అభ్యర్థులను ముందే ప్రకటించాలని పీసీసీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వివాదంలేని నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను ముందే విడుదల చెయ్యాలని పీసీసీ ప్లాన్ చేస్తోందట. అయితే సమాచారం ఏమాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. గెలుపు గుర్రాలను ముందుగా ప్రకటించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest