కాకతీయ హోటల్ చేరుకున్న ప్రకాష్ అంబేద్కర్

హైదరాబాద్ , ఏప్రిల్ 13 :
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆవిష్కరించనుంది. ఈ విగ్రహావిష్కరణకు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించింది. గురువారం సాయంత్రమే ప్రకాష్ అంబేద్కర్ హైదరాబాద్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న గ్రాండ్ కాకతీయ హోటల్ లో ప్రకాష్ అంబేద్కర్ బస చేస్తున్నారు. తెలంగాణ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎం ఎల్ సి ఎం ఎస్ ప్రభాకర్ , ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు ప్రకాష్ అంబేద్కర్ కు ఘన స్వాగతం పలికారు.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest