కేంద్రం హై అలెర్ట్.. పెరుగుతున్న కొరోనా కేసులు

న్యూ ఢిల్లీ

దేశ వ్యాప్తంగా కేంద్రం హై అలెర్ట్ జారీ చేసింది. దేశంలో కొరోనా రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ ప్రకటించింది.కొరోనా పై కేంద్రం మాక్ డ్రీల్ నిర్వహించింది. కేసులు భారీగా పెరుగుతున్నాయని కేంద్రం భావించింది.
ఏప్రిల్ 10,11 తేదీన కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహణ చెయ్యాలని నిర్ణయించింది. గుజరాత్,కర్ణాటక,తమిళనాడు ,మహారాష్ట్ర రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాలలో కేసుల సంఖ్య ను బట్టి రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశం కూడా ఉందని కేంద్రం ప్రకటించింది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కొరోనా పరిస్థితులపై ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆయా రాష్ట్రాలకు హై అలర్ట్ ప్రకటించింది.

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest