నామినేషన్ దాఖలు చేసిన పద్మారావు గౌడ్

సికింద్రాబాద్

డిప్యూటీ స్పీకర్, బీ.ఆర్.ఎస్. సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సికింద్రాబాద్ లోని జీ హెచ్ ఎం సీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసి మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాన్ని అందించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశామని అన్నారు. ఎన్నికల ప్రచార పాదయాత్రను నిర్వహిస్తున్నానని సికింద్రాబాద్ నియోజకవర్గం లో తనకు మంచి ఆదరణ లభిస్తోందని, తిరుగులేని ఆధిక్యతతో విజయం సాధించడం ఖాయమని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

డిప్యూటీ స్పీకర్ తీగల్ల పద్మారావు గౌడ్  అఖండ మెజారిటీ తో విజయం సాధించాలని కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ప్రార్ధనలు చేసిన బీ ఆర్ ఎస్ సికింద్రాబాద్ నియోజకవర్గ మహిళా నేతలు

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest