ప్రభాకర్ పై పరువు నష్టం దావ వేస్తాం

 

* రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి

హైదరాబాద్ :

బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పై పరువునష్టం దావా వేస్తామని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి అన్నారు. రాజ్యసభ సభ్యురాలిగా గెలిచినా తరువాత తొలిసారిగా గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఏఐసీసీ పెద్దలందరికీ కృతజ్ఞతలు. రాహుల్ న్యాయ యాత్ర పేద ప్రజల కోసం చేస్తున్న యాత్ర. సీఎం రేవంత్ మహిళా పక్షపాతి
ఉచిత బస్ ప్రయాణం,ఉచిత గ్యాస్ కూడా ఇస్తున్నాడు. పార్లమెంట్ ఎదుట రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్రం ఏం చేస్తుంది రైతుల పై దౌర్జన్యం చేస్తున్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వనీ నిలదీస్తాం. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఏం ఆధారాలతో మాట్లాడుతున్నాడు అతని పై పరువు నష్టం దావ వేస్తాం. ఖమ్మం ప్రజలు అందరూ నా వారసులే
ఖమ్మం సీటు గెలవడం ఖాయం. మోడీ నా సోదరుడు రాబోయే రాఖీ పండుగ కు మోదీకి రాఖీ కడుతాం అని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, బక్క జడ్సన్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest