రాహుల్ గాంధీ బహిష్కరణ రాజ్యాంగానికి విరుద్ధం

ఆసిఫాబాద్

పార్లమెంటు నుంచి రాహుల్ గాంధీ బహిష్కరణ రాజ్యాంగ స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయముగా కనిపిస్తలేదు. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం రాహుల్ గాంధీ పై తప్పుడు కేసులు పెట్టి, గుజరాత్, సూరత్ కోర్టులో రెండు సంవత్సరాల జైలు శిక్ష పడేలా చేసి, ఆ జైలు శిక్ష కూడా కోర్టు ఇచ్చిన తీర్పులోనే హైకోర్టుకు వెళ్లడానికి నెల రోజులు సమయం ఇచ్చింది.లోక్ సభ స్పీకర్ ఆ నెల రోజులు ఆగకుండా రాజ్యాంగ స్ఫూర్తిని మొత్తంగా పరిగణలోకి తీసుకోకుండా పార్లమెంటు నుంచి బహిష్కరణ చేయడం భారత రాజ్యాంగానికి విరుద్ధం. అని సి ఎల్ పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పాదయాత్ర ఆసిఫాబాద్ లో సాగుతున్న తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
లోక్ సభ స్పీకర్ కు ఒక సభ్యుడిని చట్టసభల నుంచి బహిష్కరించడం, సస్పెండ్ చేయడం విచక్షణ అధికారమైనప్పటికీ, ఆ విచక్షణ అధికారం భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి. ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా ఉన్నది.పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు చాలా తెలివైనవారు.దేశం కోసం ప్రజల కోసం మాట్లాడే వారిని గుండెల్లో పెట్టుకొని చూస్తారు.స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీని 1975 సంవత్సరంలో అలహాబాద్ కోర్టు ఆరేళ్లు బహిష్కరిస్తే తన పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేసిన ఇందిరాగాంధీని బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు గెలిపించారు.అప్పటి ప్రభుత్వం ఇందిరాపై వేధింపులకు పాల్పడడానికి సహించలేని ప్రజలు 1980 లో సంపూర్ణ మెజార్టీతో గెలిపించి అధికారం ఇచ్చారు.ప్రజాస్వామిక వాదులను అనుగదొక్కడం కోసం నియంతృత్వ పోకడలు అవలంబించే ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పిన చరిత్ర ఈ దేశానికి ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి ఈ దేశ ప్రజలందరూ ఉన్నంటే ఉన్నారు. దేశాన్ని సామాజికంగా, ఆర్థికంగా విభజించి విచ్ఛిన్నం చేయాలని చూస్తుంటే ప్రజల సంపద ప్రజలకే చెందాలని ఆధాని లాంటి బహుళ జాతి సంస్థలకు కాదని గొంతేత్తి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ తమకంటే పెద్ద నాయకుడు అయిండన్న భయంతో నరేంద్ర మోడీ అమిత్ షా నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం కుట్రతో సూరత్ లో తప్పుడు కేసులు పెట్టింది. దేశ సంపద దోచుకున్న ఆర్థిక నేరస్తులైన నీరవ్ మోడీ, లలిత మోడీలను దేశం దాటించి ప్రజలకు చెందాల్సిన సంపద ప్రజలకే చెందాలన్నందుకు రాహుల్ ను అరెస్టు చేస్తారా?


ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాట్లాడటం రాహుల్ గాంధీ చేసిన తప్పా?దేశంలో భావ స్వేచ్ఛను చంపేస్తున్నారని, మాట్లాడే వారిని మాట్లాడనివ్వడం లేదని చెప్పడంలో తప్పు ఏముంది?దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లు, సిపోర్ట్లు బొగ్గు గనులు, పవర్ సెక్టార్, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ప్రజలకే చెందాలని క్రోని క్యాపిటలిస్టులైన ఆదానికి దోచిపెట్టడం సరికాదన్నందుకే రాహుల్ పై మోడీ కక్ష కట్టారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రజలందరి బాధ్యత ఇందుకోసం ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల వాదులు, లౌకికవాదులు, రాజ్యాంగ ప్రేమికులు ప్రజాస్వామ్యాన్ని, దేశ సంపదను కాపాడుకుందాం.బిజెపి చేస్తున్న ఈ ఆకృత్యాలను ముక్తకంఠంతో అందరూ ఖండించాలి. నిజమైన ప్రజాస్వామ్యవాది, లౌకికవాది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం, ప్రగతిశీల సామ్యవాదాన్ని ముందుకు తీసుకెళ్తున్న రాహుల్ గాంధీకి భయపడి  నరేంద్ర మోడీ,  అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం పన్నిన కుట్రయే ఈ బహిష్కరణ వేటు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ గారు మాట్లాడింది నిజమే కాబట్టే అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. రాహుల్ గాంధీని కాపాడుకోవడమే. ఈ దేశ ప్రజాస్వామ్యం, సంపద, వనరులు, రాజ్యాంగాన్ని కాపాడుకోవటం.రాహుల్ గాంధీ బహిష్కరణ వేటుకు వ్యతిరేకంగా ఎఐసిసి ప్రత్యేక ఉద్యమ కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నది.జై సిసి కార్యచరణ ప్రణాళిక ప్రకారంగానే తెలంగాణలో కూడా ఉద్యమాలు ఉంటాయి అందులో పాల్గొంటాను.బిజెపికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి మద్దతుగా ఆసిఫాబాద్లో ఈరోజు సాయంత్రం 2000 మందితో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నాం అని భట్టి పేర్కొన్నారు.మాజీ ఎం ఎల్ సి ప్రేమ్ సాగర్ రావు, ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్, రవళి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest