మహబూబ్ నగర్
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు మహబూబ్ నగర్ జిల్లా రివ్యూ మీటింగ్ మరియు హథ్ సే హథ్ జోడో పాదయాత్ర గురించి మీటింగ్ పెట్టి డోర్ టు డోరు హథ్ సే హథ్ యొక్క పాదయాత్ర గురించి వివరిస్తూ డోర్ పోస్టర్లు వేయడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల లో ప్రజలకు ఏం చేసింది? ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని ఈ రెండు ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ డోర్ టు డోర్ మహబూబ్నగర్లో తిరగడం జరిగింది. జిల్లా రివ్యూ మీటింగ్ లో మండల ప్రెసిడెంట్లతో. బ్లాక్ ప్రెసిడెంట్ లతో పట్టణ ప్రెసిడెంట్ లతో ముఖాముఖిగా మాట్లాడి , కమిటీలు మొత్తము పూర్తిచేయాలని సునీత రావు అన్నారు. అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ నాయకులను టిఆర్ఎస్ నాయకులను ఎక్కడకక్కడ నిలదీసి అందరికీ న్యాయం జరిగేటట్లు ప్రభుత్వ పథకాలను అందజేయాలని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని ఎలక్షన్లు దగ్గరలో ఉన్నవి కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పనిచేయాలని తెలపడం జరిగింది.