హైదరాబాద్ :
వైఎస్ షర్మిలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సిట్టింగ్ జడ్జ్తో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పేపర్ లికేజీకి నిరసనగా టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి షర్మిల పిలునివ్వడంతో ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం మండిపడ్డారు. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధ్వజమెత్తారు. పేపర్ లికేజీకి నిరసనగా టీఎస్పీఎస్సీ కార్యాలయ ముట్టడికి షర్మిల పిలునివ్వడంతో ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. ” బంగారు తెలంగాణలో ప్రజా స్వామ్యం ఉందా లేదా.. కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఇది నియంత పాలన తలపిస్తోంది. ఒక్క ప్రతిపక్షానికి కూడా ఈరోజు గొంతు విప్పి మాట్లాడే అధికారం కూడా లేకుండా కేసీఆర్ గారు ఇంత కట్టడి ఎందుకు చేస్తున్నారు. భారత దేశ రాజ్యంగా తెలంగాణలో అమలు కావడం లేదు. ఎక్కడ కనిపించడం లేదు. తెలంగాణలో కనిపించేది ఒక్క కేసీఆర్ రాజ్యంగమే.” అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల అన్నారు.
టీఎస్పీఎస్సీది పెద్ద స్కామ్ అని షర్మిల ఆరోపించారు. ఇది అందరూ కుమ్ముక్కు అయి చేశారని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ సీబీఐతో దర్యాప్తు చేయించాలన్నారు. బోర్డు ఛైర్మన్ దగ్గర నుంచి.. మంత్రుల స్థాయిలో హస్తం ఉందని వెల్లడించారు. ప్రశ్నపత్రాలు కావాలనే లీక్ చేశారని తెలిపారు. బోర్డు మొత్తం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిట్తో దర్యాప్తు కరెక్ట్ కాదన్న షర్మిల సిట్ మీకు అనుకూలంగా విచారణ చేస్తోందని ఆరోపించారు. అందుకే సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. లేకుంటే సిట్టింగ్ జడ్జ్తో విచారణ చేయించాలని కోరారు.