దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన చివరి చిత్రం ‘మనం’. ఇందులో అక్కినేని మూడు తరాల నటులు కనిపిస్తారు. అక్కినేని నాగేశ్వర్ రావు, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఇలా కుటుంబ సభ్యులంతా కలిసి నటించిన ఈ ‘మనం” సినిమాను తాజాగా రీ రిలీజ్ చేశారు. ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లోని దేవి 70 ఎం ఎం థియేటర్ లో సినిమా చూడ్డానికి వెళ్లిన అక్కినేని కుటుంబ సభ్యులంతా థియేటర్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. సుప్రియ బాగా ఎమోషన్ అయ్యారు. హృదయాన్ని కదిలించే సన్నివేశం తెరపైకి వచ్చినప్పుడు ఒక పక్క ఫాన్స్ అంత అరుస్తుంటే కుటుంబ సభ్యులు మాత్రం బాగా ఎమోషన్ అయ్యారు. సినిమా చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. మనం అనేది ఒక సినిమా కాదు ఇది ఎమోషన్ అని కుటుంబ సభ్యులంతా సోషల్ మీడియాలో తమ భావాలను పంచుకున్నారు
Post Views: 36