ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గెలిచెన్

పిఠాపురం :

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు ఓడిపోయిన జనసేన అధినేత, సినిమా నటుడు పవన్ కళ్యాణ్ కొణిదెల ఎట్టకేలకు మూడోసారి విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నాడు. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. 68. 87 ఓట్లను సాధించారు. పవన్ కు పోటీగా వైసీపీ నుంచి వంగా గీత నిలబడ్డారు. ఈమె ఒకప్పుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు. ఇద్దరు కూడా ఒకే కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో పోటీ రసవత్తరంగా సాగుతుందని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ కూడా ఒకరోజు పవన్ కోసం ప్రచారానికి వెళ్లారు. ఫలితాల రోజు మధ్యాహ్నం వరకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోనే ఉన్నారు. ఆయన భార్య అన్హా విజయతిలకం దిద్ది పంపించారు. హైదరాబాద్ నుంచి మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయానికి వెళ్లి అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రము అభివృధ్ధికోసం కృషి చేస్తామని అన్నారు. పగలు, ప్రతీకారాలు తీర్చుకునే సమయం కాదని చెప్పారు. ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest